Friday, October 4, 2013

ఆమరణ దీక్ష

బ్రేకింగ్ న్యూస్ .....
రేపు హైదరాబాద్ లో సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం తన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేయనున్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

Thursday, October 3, 2013

 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణకు పచ్చ జెండా  ఊపింది. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని హోం మంత్రి షిండే ప్రకటించారు. విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రుల ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. ఆదాయలు, అప్పులు,జల పంపిణీ వంటి అంశాలను చర్చిస్తుంది. నూతన రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్రం సమకూరస్తుందని...సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిదులు విడుదల చేస్తామని షిండే తెలిపారు. సీమాంధ్రకు నూతన రాజదాని అంశం కేంద్ర మంత్రి వర్గమే పరిష్కరిస్తుందని తెలిపారు.