Sunday, September 23, 2012

Telangana mourns as Bapuji passes away without seeing the state


Telangana mourns as Bapuji passes away without seeing the state

Another great Telangana fighter has breathed his last even as the Indian government is still dilly-dallying on the statehood issue. Eminent freedom fighter and a well-known figure in the Telangana movement, Konda Lakshman Bapuji died Hyderabad on Friday. He was 96.
Bapuji, who was not keeping well for the last few months, breathed his last at his home in Ashok Nagar, family members said. He is survived by two sons and a daughter.
Born on Sep 27, 1915 at Wankidi in Adilabad district, Konda Lakshman earned the nickname Bapuji for his participation in the Quit India Movement.
TRS chief K Chandrasekhara Rao, Telangana Joint Action Committee convenor M Kodandaram, BJP state president G Kishan Reddy and leaders cutting across party lines paid rich tributes to the veteran leader.
The body has been kept at Padmashali Bhavan in Kachiguda to enable people to pay their last respects. The last rites will be performed Saturday.
Both houses of state legislature paid their respects to Bapuji. The legislators observed a two-minute silence to mourn his death.
The chief minister announced in the assembly that the departed leader’s last rites would be performed with state honors. He also declared that a memorial for Bapuji would be built in Hyderabad.
Chandrababu Naidu said Bapuji’s services for backward classes would also be remembered. He termed the freedom fighter’s death a loss both for the state and the country.
State Congress chief Botsa Satyanarayana, Rajya Sabha member K Chiranjeevi, CPI state secretary K Narayana, CPI-M’s BV Raghavulu, state ministers, MPs and other leaders paid their last respects.
Bapuji, a socialist, took an active part in the armed struggle against the Nizam government of then Hyderabad State.
He resigned as minister in the Andhra Pradesh cabinet in 1969 to join the movement for separate statehood to Telangana.
The veteran leader had also observed a seven-day fast in Delhi late last year to press the demand for Telangana state and had threatened to go on indefinite fast to achieve the goal.
He alongwith several intellectuals and freedom fighters from Telangana had floated a front last year to intensify the Telangana movement.
LAst year, Bapuji had launched a series of meetings with leaders from the Andhra region to convince them to agree for bifurcation of the state. (with inputs from IANS)

http://missiontelangana.com/karimnagar-march-grand-success/


కదన కవాతు చేసిన తెలంగాణ

సెప్టెంబర్ 30న ప్రళయ భీకరమైన రీతిలో హైదరాబాద్ వీధుల్లో జరగనున్న తెలంగాణ మార్చ్ కు సన్నాహకంగా కరీంనగర్ లో నిర్వహించిన మార్చ్ విజయవంతమైది. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన తెలంగాణావాదులతో కరీంనగర్ వీధులు హోరెత్తాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సి.పి,ఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ మార్చ్ కు మద్ధతుగా నిలిచాయి.
“జై తెలంగాణ” అనే నినాదాలతో దిక్కులు పిక్కటిల్లేలా తెలంగాణా ప్రజానీకం గర్జించింది. పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ ఒక్కటై కలిసివచ్చిన ఈ అపురూప దృశ్యం, తెలంగాణలోని సబ్బండవర్ణాలు కలిసి చేసిన తెలంగాణ నినాదం తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటీలో నూతనోత్సాహం నింపింది.
“ఇంటికో మనిషి, చేతికో జెండా” అనే నినాదంతో 30 నాడు హైదరాబాద్ తరలి రావాలని, డిల్లీ గుండెలు ఝల్లుమనేలా ఉద్యమశంఖారావం మోగించాలని కరీంనగర్ మార్చ్ కు హాజరైన నేతలు పిలుపునిచ్చారు.

చరిత్ర పుటలకు ఎక్కకుండా విస్మరింపబడ్డ 1954-1956 తెలంగాణ ఉద్యమ చరిత్రలోంచి మచ్చుకు కొన్ని క్లిప్పింగులు.


చరిత్ర పుటలకు ఎక్కకుండా విస్మరింపబడ్డ 1954-1956 తెలంగాణ ఉద్యమ చరిత్రలోంచి మచ్చుకు కొన్ని క్లిప్పింగులు. ఈ ఉద్యమ చరిత్ర విశేషాలతో త్వరలోనే ఒక పుస్తకం తెస్తున్నాం.

—.
(నవంబర్ 1955 గోలకొండ పత్రిక నుండి)

September 30th should be etched in history: Kodandaram


September 30th should be etched in history: Kodandaram

“September 30th Telangana March should become a memorable chapter in the history of world people’s movements” said Prof. Kodandaram. He was participating in a round table organized by “Maa Hyderabad” to discuss about the role of Hyderabadi’s in the ongoing Telangana agitation. He requested all Telangana citizens to be ready for this mega event.
Kodandaram informed that the preparations for this mega agitation are already underway. He said that the JAC leaders would meet Muslim leaders from old city after the Ramzan festival.
TJAC is planning several events to mobilize natives of Hyderabad. They have planned padayatras in several bastis of Hyderabad.
Telangana Praja Front Convenor M. Ved Kumar, Telangana Lok Satta president Dharma Reddy, representatives of Maa Hyderabad Koride Umakanth and Sridhar Dharmasanam and several TJAC representatives and Telangana activists participated in the round table.

“కరీం నగర్ కవాతు


సెప్టెంబర్ 30 నాడు హైదరాబాదులో  తెలంగాణ జేయేసి మహోధృతంగా ప్రారంభం కానున్న తెలంగాణ మార్చ్ కు సన్నాహకాల్లో భాగంగా కరీంనగర్ నగరంలో “కరీం నగర్ కవాతు” పేరిట ఒక కార్యక్రమం నిర్వహించనుంది. దాని పోస్టర్ ఇది:

1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని దుస్థితి ఇదీ


తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో చాలా తరచుగా హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని సమైక్యవాదులు అవాకులు చవాకులు పేలుతుంటారు. అయితే హైదరాబాద్ నగరం ఆరేడు దశాబ్దాల క్రితమే ఒక మహానగరానికి కావలసిన అన్ని హంగులూ ఉన్న నగరం అనేది నిర్వివాదాంశం. అందుకు సకల సాక్ష్యాలూ ఉన్నాయి.
అసలు ఇంతకూ ఆంధ్ర రాష్ట్రపు రాజధానిగా మూడేండ్లు ఉన్న కర్నూల్ టౌన్ పరిస్థితి ఏమిటో ఇప్పటి తరంలో చాలా మందికి తెలియదు.
దీనికి కొంత నేపధ్యం తెలుసుకోవాలి.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో అప్పటి నాయకులు మద్రాసు నగరం కొరకు పట్టుబట్టారు. మద్రాసులో తమిళులే అధికసంఖ్యలో ఉన్నప్పటికీ ప్రకాశం పంతులు వంటి నాయకుల మూర్ఖపు పట్టుదల వల్ల ఆంధ్ర రాష్ట్రపు ఏర్పాటు చాలాకాలం పాటే వాయిదా పడింది. చివరికి ఇదే డిమాండుతో పొట్టి శ్రీ రాములు ఆత్మ త్యాగం చేసినా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు దక్కలేదు.
1930ల నుండే సాటి ఆంధ్ర వారితో కలిసి రావడానికి రాయలసీమ వారు ఇష్టపడలేదు. ఆంధ్రవారితో కలిసి ఒక రాష్ట్రంలో ఉండటం కన్నా తమిళులతో కలిసి అప్పటి మద్రాసు రాష్ట్రంలోనే కొనసాగడమే రాయలసీమ భవిష్యత్తుకు మంచిదని అక్కడి నాయకులు తలిచారు.
చివరికి ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూల్ అవతరించింది.
అప్పటికి కర్నూల్ ఒక చిన్న టౌన్. ఏ విధమైన మౌలిక వసతులు లేవు. అన్ని ముఖ్య ఆఫీసులు, ఉద్యోగులు కూడా గుడారాలలోనే ఉండేవారు. సరైన పారిశుధ్యం, రోడ్లు లేక, వర్షం వస్తే బురదమయంగా మారే నల్ల రేగడి నేలల్లో నానా అవస్థలూ పడేవారు. అప్పటి పత్రికలు స్వయంగా కర్నూల్ ను డేరానగర్ గా వ్యవహరించేవారు. దినపత్రికల్లో ఈ డేరానగర్ దుస్థితి గురించి కార్టూన్లు కూడా వేసేవారు.
ఆ కాలం దినపత్రికల్లో వచ్చిన ఫొటోలు, వార్తలు చూస్తే మనకే అర్థం అవుతుంది ఆంధ్రరాష్ట్ర రాజధాని సొగసు ఎంతనో.
అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ లో భవంతులు, వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేదు. చివరికి డిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకుని, అప్పటికే సర్వ హంగులతో సిద్ధంగా ఉన్న హైదరాబాదును చేజిక్కించుకున్నారు సీమాంధ్ర నాయకులు.
ఈసారి ఎవరైనా హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని సొల్లు వాగుడు వాగితే వారికి తెలంగాణతో విలీనమయ్యేనాటికి ఆంధ్ర రాజధాని దుస్థితిని ఎరుకపరచండి.






పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (చివరి భాగం)


డిసెంబర్ 10 నాడు నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గూర్చి చేసిన ప్రకటన అటు మెజారిటి తెలుగు ప్రజలు, నాయకులు ఆమోదించారు. కానీ ప్రకాశం బృందం మాత్రం తమ అత్యాశ మానుకోలేదు.
డిసెంబర్ 11, 1952 నాడు ఆంధ్ర ప్రభ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్ అప్పటి వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతుంది.
***
ఆంధ్ర రాష్ట్రం అనే స్త్రీని కారాగారంలో వేసి దానికి మదరాసు అనే తాళం బిగించి, దానిని ఎవరూ తీయకుండా దుడ్డుకర్ర పట్టుకుని కాపలాకాస్తున్న ప్రకాశం బృందం!
***
13 డిసెంబర్ నాటికి పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అనేకమంది ఆంధ్ర రాజకీయ నాకులు, ప్రముఖులు ప్రకాశం  బృందం తమ బెట్టువీడాలని, మదరాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకోవాలని విజ్ఞప్తులు చేశారు.
పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రజలు అనేకచోట్ల రైళ్లను అడ్డగించడం, ర్యాలీలు తీయడం మొదలుపెట్టారు.
చాలా పట్టణాల్లో మదరాసులేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ఊరేగింపులు జరిగాయి.



***
దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థం అయ్యేదేమిటంటే మదరాసు నగరాని కోరుకున్నది గుప్పెడు మంది స్వార్ధ రాజకీయనాయకులే కానీ ఆనాటి ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కారని.
డిసెంబర్ 16 నాడు ఆంధ్రప్రభ పత్రిక తన సంపాదకీయంలో ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, స్వామి సీతారాంల వైఖరిని తీవ్రంగా ఎండగట్టింది.
***
“ఎవరు ద్రోహులు?” అనే శీర్షికతో వచ్చిన ఆ సంపాదకీయంలో
” ఈ పరిస్థితిలో ముక్కోటి ఆంధ్రుల అభిమతం ఈడేరడం ముఖ్యమా? ఈ ముగ్గురు ముసలివారి మంకుపట్టు నెగ్గడం ముఖ్యమా? ఇప్పుడిక లోకమే నిర్ణయించాలి. ఆంధ్ర రాష్ట్రానికి అడ్డుగా నిలుస్తున్నవారెవరో, ఆంధ్రజాతికి ద్రోహం చేస్తున్నవారెవరో” అని రాశారు.
***
16 డిసెంబర్ నాడు అదే ఆంధ్రప్రభలో ప్రచురితమైన ఈ కార్టూన్ చూడండి ఎంత చక్కగా అప్పటి వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తుందో  :
***
చివరికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో 15 డిసెంబర్ 1952 అర్ధరాత్రి 11:23 నిముషాలకు పొట్టి శ్రీరాములు తుదిశ్వాస విడిచాడు…గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందే పూర్తిగా స్పృహ తప్పారు. అటువంటి పరిస్థితిలో కూడా ఆయనకు ఎందుకు వైద్య సహాయం అందించలేదనేది జవాబులేని ప్రశ్న.
స్వార్ధ ప్రయోజనాలే పరమావధిగా ప్రకాశం వంటి సీమాంధ్ర రాజకీయ నాయకులు మదరాసు నగరాన్ని చేజిక్కించుకునేందుకు ఆడిన జూదంలో పొట్టిశ్రీరాములు ప్రాణాలు ఫణంగా సమర్పించారు అని చెప్పొచ్చు.

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (మూడవ భాగం)



అక్టోబర్ 30, 1952 నాడు మదరాసులో జరిగిన లా కాలేజి విద్యార్ధుల సభలో పలువురు ఆంధ్ర రాష్ట్ర నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఆనాడు సభకు అధ్యక్షతవహించిన ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
“ఒక కొసన ఉన్న చెన్నపురి (మదరాసు) ఆంధ్ర రాష్ట్రనికిగాని, తమిళ రాష్ట్రానికిగానీ ముఖ్యపట్టణంగా పనికిరాదనీ, చెన్నపురి తమకు దూరం కాబట్టి తాము ఒరిస్సాలో చేరగలమని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలవారు అనవచ్చునని కాబట్టి చెన్నపురి సమస్యను రాష్ట్ర నిర్మాణానికి ప్రతిబంధకం కానివ్వరాదని అన్నారు.
పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగినన్నాళ్ళూ ఆయన ప్రాణాలు రక్షించడానికి పాపం నార్ల గారు చేయని ప్రయత్నం లేదు. ఆనాడు ఆంధ్ర ప్రభ తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ గలిగిన పత్రిక. తన పత్రికలో రోజూ వార్తలు, కార్టూన్లు, సంపాదకీయాల ద్వారా ప్రకాశం వంటి ఆంధ్ర నాయకుల మూర్ఖపు, నిర్హేతుక వైఖరులను, ఫట్టుదలలను విమర్శించేవారు నార్ల వెంకటేశ్వరరావు గారు.
అయితే ఆంధ్ర రాష్ట్రోద్యమ నాయకులు మాత్రం ఎవరి హితోక్తులూ వినలేదు.
రోజులు గడుస్తున్నా, పొట్టిశ్రీరాములు ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతున్నా పట్టించుకోకుండా ఇటు ప్రకాశం పంతులు, అటు నీలం సంజీవరెడ్డిలకు తోడు దీక్ష వేదికగా తన ఇల్లును ఇచ్చిన బులుసు సాంబమూర్తి, ఇంతకు ముందొకసారి ఆంధ్ర రాష్ట్రం కొరకు దీక్షచేసి విరమించిన స్వామిసీతారాం – ఈ నలుగురూ వివిధ వేదికలపై మదరాసు నగరంపై వింతవింత వాదనలు చేయడం మొదలుపెట్టారు.
మచ్చుకు 30 అక్టోబర్, 1952 నాడు లా కాలేజీ విద్యార్ధుల సభలో నీలం సంజీవరెడ్డిగారు అన్న ఈ ఆకుకు, పోకకు అందని ఈ వ్యాఖ్యలు చూడండి.
“అపుడూ మదరాసుపై హక్కులు వదులుకున్నాం అని చెప్పాం, కానీ అది అరవలకు ఇస్తున్నామని అంగీకరించలేదు….మదరాసులో అరవలు ఎక్కువ ఉన్నారని ఒప్పుకోవచ్చు, కాని, అరవేతరులు అంతకన్న ఎక్కువ కనుక మదరాసును అరవలు కోరరాదు…మదరాసు అరవలకు, ఆంధ్రులకు ఉమ్మడిగానుంటే కష్టమేమిటి? మదరాసులో వారు చెప్పినట్లు అరవలు 80మంది ఉన్నా, 16గా ఉన్న ఆంద్రుల హక్కులు కాపాడడానికైనా, అది ఉమ్మడిగా ఉండాలి”
చూశారుగా, ఇది చూస్తే ఇప్పుడు సీమాంధ్ర నేతలు తెలంగాణపై చేసే అడ్డగోలు వాదనలు గుర్తుకురావట్లేదూ?
ఇటు ఆంధ్ర నేతలు, అటు తమిళ నేతలు మదరాసు నగరంపై సవాళ్లూ ప్రతిసవాళ్లూ విసురుకుంటూ, పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటం చూసి, మదరాసు యువజన ఫెడరేషన్ కు చెందిన కేశవలాల్ తరవాది అనే గుజరాతి యువకుడు చేసిన ఈ హెచ్చరిక చూడండి.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
6 నవంబర్, 1952 నాడు మదరాసు నగరంలో సమావేశమైన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, మదరాసును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది.
దీనికి సరిగ్గా వారం రోజుల ముందు తమిళ కాంగ్రెస్ పార్టీ మదరాసుపై తెలుగు వారికి ఎట్టి హక్కు లేదని తీర్మానం చేయడం గమనార్హం.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
పొట్టి శ్రీరాములు గారి దీక్ష మొదలై దాదాపు నెలగడిచాక మదరాసులో ఆంధ్ర విద్యార్ధి విజ్ఞానసమితి వారి విజ్ఞానోత్సవం సభలో పాల్గొంటూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక గొప్ప మాట చెప్పారు.
“ఇక మదరాసు సమస్య ఇటీవల వచ్చింది. దీనికోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే, పొలంగట్టు కోసం దావాలకు దిగి, ఖర్చులకోసం పొలం అమ్ముకున్నట్లవుతుంది. ఆంధ్ర రాష్ట్రం సంపాదించడం మన ప్రధాన సమస్యా లేక మదరాసు సంగతి తేల్చడం ప్రదాన సమస్యా? అని ఆలోచించాలి. మదరాసు గురించి మనవారు సూచిస్తున్న మూడు ప్రతిపాదనలతో మదరాసు ఆంధ్ర రాష్ట్రంలో భాగం కాదని రుజువవుతున్నది. మనదీ అనడానికి దమ్ములు లేక, చెరిసగం అని, ప్రత్యేక రాష్ట్రమని, అరవలకు పోరాదని అంటునారు, కనుక, వివాదం లేని ప్రాంతాలతో రాష్ట్రం తీసుకొని, తరువాత తక్కినవాటికై పోట్లాడాలని, నెహ్రూని లొంగదీయగల ఉద్యమం నేడు లేవదీయలి. దానికి విద్యార్ధులు పూనుకోవాలి”
డిసెంబర్ మొదటి తారీఖు కల్లా పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
3వ తారీఖునాడు ఆచార్య ఎన్ జి రంగా, నల్లారెడ్డి నాయుడు, వి. రాజగోపాలరావు, ఎన్ శేషయ్యగార్లతో కూడిన నలుగురు పార్లమెంటు సభ్యుల బృందం వెంటనే నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాసింది.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఆంధ్ర నాయకులంతా డిసెంబర్ 7 నాడు ఒక అత్యవసర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమావేశం జరిగేనాడు ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుగారు తన దినపత్రికలో ఆంధ్ర నాయకులు ఇలాగే జాగుచేస్తే పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని అత్యంత ఆవేదనతో ఇలా రాశారు:
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
కానీ కొండకు (మదరాసుకు) వెంట్రుక (పొట్టి శ్రీరాములు ప్రాణం) కట్టి లాగుతున్నాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అన్న చందాన వ్యవహరించారు అప్పటి సీమాంధ్ర నాయకులు.
ఆనాటి సభలో ప్రకాశం పంతులు చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. ఆద్యంతం నవ్వుతూ, చలోక్తులతో, జోకులేస్తూ ప్రసంగించాడు. దీక్ష మొదలుపెట్టాక తాను పొట్టి శ్రీరాములును ఒక్కసారి మాత్రమే కలిసానని చెప్పుకున్నాడు. ఆయన ప్రసంగంలో ఈ వాక్యం చూడండి:
“గత కొలది దినాలుగా ఆయన పరిస్థితి ప్రమాదంలో పడింది. ఏ క్షణంలో అయినా ఆయన ప్రాణం కాస్తా హరీ అనవచ్చు. అప్పుడు ఆంధ్ర దేశంలో, మద్రాసు నగరంలో ప్రజలలో ఉద్రేకం విపరీతంగా పెరిగిపోవడం తధ్యం”
పొట్టి శ్రీరాములు ప్రాణాల పట్ల ఆంధ్ర రాష్ట్రోద్యమ ముఖ్య నాయకుడిది ఎంత నేరపూరిత నిర్లక్ష్యమో చూశారా?
ఈ సభలో ప్రకాశంతో పాటు అనేక మంది ఆంధ్ర నాయకులు మళ్ళీ పాత పాటనే పాడారు. మదరాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కుదరని పక్షంలో మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఉమ్మడి రాజధానిగా అన్నాఉంచాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని గౌతు లచ్చన్న వంటి కొంత మంది ఆంధ్ర నాయకులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఇరు పక్షాలూ కేకలు వేసుకున్నారు. ప్రకాశం పంతులు, తరిమెల నాగిరెడ్డి అయితే వేదికపైనే పరస్పరం వాదనలకు దిగారు.
చివరికి వేదికను ఎక్కిన ప్రముఖ కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి మాట్లాడుతూ:
ఈ తీర్మానం కనుక ఆమోదిస్తే రాష్ట్ర ఏర్పాటు 50 సంవత్సరాలు వాయిదా పడుతుందని, ఈ తీర్మానం వల్ల రాష్ట్రమూ రాదు, శ్రీరాములు గారి ప్రాణమూ రక్షించడం సాధ్యం కాదన్నారు.
చివరికి మందబలంతో ప్రకాశం పంతులు వాదనే నెగ్గింది. ఆ సభలో అమోదం పొందిన తీర్మానం ఒకవిధంగా పొట్టి శ్రీరాములు మరణశాసనం!
డిసెంబర్ 9 నాడు స్టేట్ కౌన్సిల్ లో మాట్లాడుతూ నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నెహ్రూ ప్రకటించాడు.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
అయినా ఆంధ్ర నాయకులు తమ మూర్ఖపు పట్టుదల విడువలేదు.

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (రెండవ భాగం)


తెలుగు వారికొరకు ఒక రాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడాలనే కోరిక 1910ల నుండే ప్రారంభమైనా వివిధ కారణాల వల్ల ఆ స్వప్నం నిజం కావడానికి నాలుగు దశాబ్దాల కాలం పట్టింది.
అయితే ఈ ఆలస్యానికి చాలా వరకు కారణం బయటివారుకాక అప్పటి ఆంధ్ర నాయకుల మధ్య ఉన్న అపనమ్మకాలు, విభేధాలు, పరస్పర నమ్మకరాహిత్యం కావడమే విషాదం.
చూడడానికి అంతా హేమాహేమీలే అయినా తమతమ వ్యక్తిగత అహాలు, స్వార్ధాల కారణంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది.
కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీ, ప్రజా పార్టీ, కృషికార్ పార్టీ, ఆంధ్ర మహాసభ, కిసాన్ మజ్దూర్ సభ…ఇలా అనేక పార్టీలు, సంస్థలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ఒక కొలిక్కి రాకుండా చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినా, కొందరు ముఠాకోర్లు మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండును తెరపైకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును జటిలం చేసుకున్నారు.
పొట్టి శ్రీరాములు మరణానికి ప్రధానంగా నలుగురు సీమాంధ్ర నేతలు కారణమని అప్పటి ఘటనల క్రమం చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రకాశం పంతులు గురించి.
స్వాతంత్రం రాకపూర్వమే మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన, తన మొండిపట్టుదల వల్ల ఏడాదికాలం కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయాడు.
చివరికి అప్పటి నెహ్రూతో కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించాడు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పంపకాలు చేయడానికి 1949లో ఏర్పాటైన పార్టీషన్ కమిటీలో, ఏడుగురు సభ్యులు మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతిస్తే, ప్రకాశం పంతులు మాత్రం చెన్నపట్నం లేకుండా ఆంధ్ర రాష్ట్రం వద్దని తిరకాసు పెట్టాడు.
అయితే ఆనాడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం మదరాసు నగరంపై పెద్ద వ్యామోహమేమీ లేదు. ఏదో ఒకలాగా రాష్ట్రం వస్తే చాలని ప్రజలనుకుంటుంటే, ప్రకాశం వంటి నాయకులేమో 1950, 1951 సంవత్సరాలు మొత్తం మద్రాసు నగరంతో పాటు ఆంధ్ర రాష్ట్రం కావాలని, లేదా మద్రాసును చీఫ్ కమీషనర్ స్టేట్ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలని ప్రకటనలు గుప్పించసాగారు.
(ఇప్పుడు సీమాంధ్ర నాయకులు హైదరాబాదును కేంద్రపాలితప్రాంతం చేయాలని అనడం వెనుక నేపధ్యం అర్థం అయ్యిందా?)
ఈ నాయకుల వలెనే మద్రాసులో పుట్టి పెరిగిన పొట్టి శ్రీరాములుకు కూడా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే కోరిక ఉండేది.
అటు తమిళ, ఇటు తెలుగు నాయకులు మద్రాసు నగరంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో నెలలు గడుస్తున్నా అసలు సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ద్వారా మద్రాసు భవితవ్యాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నాడు.
అక్టోబర్ 20 1952 నాడు బులుసు సాంబమూర్తి ఇంటిలో పొట్టి శ్రీరాములు తన ఆమరణ దీక్ష మొదలుపెట్టాడు. ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కొరకే తాను దీక్షకు కూర్చున్నట్టు ప్రకటించాడు.
(ఆంధ్రప్రభ నుండి)
అయితే ఇక్కడొక విషయం గమనించాలి.
తెలుగువారికి మద్రాసు నగరంతో అనుబంధం ఉన్నమాట నిజమైనప్పటికీ ఏ విధంగా చూసినా వారికి ఆనాడు ఆ నగరం దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాటికి మద్రాసు నగరంలో తమిళులే అధికం. దానికి తోడు అనేక ఏళ్ల నుండి ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న మదరాసు నగరాన్ని వదులుకోవడానికి తమిళులు ఒప్పుకునే ప్రశ్నే లేదు.
ఇక మదరాసు నగరం తెలుగువారికే హక్కుభుక్తం కావాలని మొదటినుండీ మంకుపట్టు పడుతున్న టంగుటూరి ప్రకాశం పంతులు వాదన ఎంత అర్ధరహితమో ఒక ఉదాహరణ చెప్పాలిక్కడ.
1952 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదరాసు నగరంలోని హార్బర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ప్రకాశం పంతులు పోటీచేసాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కృష్ణారావు గెలవగా, రెండో స్థానంలో నిలిచిన ఇబ్రహీం అనే ఇండిపెండెంటుకు 11 వేల ఓట్లు వస్తే, అప్పటికే మహా నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కీలక వ్యక్తిగా నిలిచిన ప్రకాశం పంతులు 7 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కూడా దక్కక చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
Source – Election Commission of India
మరి ఇలాంటి పరిస్థితిలో మదరాసు నగరం తెలుగువారికి దక్కుతుందని ప్రకాశం వంటి ఆంధ్ర నాయకులు ఎలా అనుకున్నారు?
ఇక పొట్టి శ్రీరాములు దీక్ష ప్రారంభం అయిన మరునాడే అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు పి. సుబ్బరాయన్ చెన్నపురి (మద్రాసు) ను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సులభం అవుతుందని ప్రకటించాడు.
కానీ, దీక్ష మొదలైన రెండో రోజు నీలం సంజీవరెడ్డి మదరాసు నగరాన్ని ప్రత్యేక కమీషనర్ రాష్ట్రంగా (కేంద్రపాలిత ప్రాంతం)గా ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
శ్రీ రాములు దీక్ష మొదలైన వారం రోజులకు రాష్ట్రోద్యమంలో చురుకుగా ఉన్న ప్రధాన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ మొదట పరిస్థితి తీవ్రతను గ్రహించింది. నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కమిటీ తీర్మానించింది.
(ఆంధ్రప్రభ నుండి)
అయితే అదే రోజు ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు మాత్రం ఇంకా మదరాసులో అరవవారికన్నా తెలుగువారే అధికంగా ఉన్నారనే అసంబద్ధపు ప్రకటన చేశారు.
అక్టోబర్ 27 నాడు పార్లమెంటు సభ్యుడు లంకా సుందరం నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం నిర్మించి మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని రాష్ట్రపతిని కోరాడు.
అక్టోబర్ 28 నాడు బులుసు సాంబమూర్తి కూడా ఒక సభలో మాట్లాడుతూ మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
ఇక పొట్టి శ్రీరాములు దీక్ష మొదలైన 10 రోజులకు అన్నిటికన్నా ఘోరమైన విషయం జరిగింది.
అప్పటిదాకా మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించిన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రెండేళ్ల కిందటి తీర్మానానికి మద్ధతు పలికిన నేత నీలం సంజీవరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించి మదరాసుపై ఆంధ్రులు హక్కును వదులుకోరని ప్రకటించాడు.
అంతే కాదు ఇంకో అయిదేళ్ల వరకూ ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి లేకపోవడం వల్లనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నాడు.
(ఆంధ్రప్రభ నుండి)
ఎంత దుర్మార్గమో చూడండి. ఒకవైపు నిరాహార దీక్షకు కూర్చున్న పొట్టి శ్రీరాములు ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తున్న వేళ సాక్షాత్తూ నీలం సంజీవ రెడ్డే ఇంకో అయిదేళ్ల వరకూ రాష్ట్రం రాదని చెబుతున్నాడు.
మరి అటువంటి పరిస్థితులో పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగిస్తుంటే దాన్ని ఆపకుండా ఎందుకు ఉన్నట్టు?

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు?


పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (మొదటి భాగం)

సీమాంధ్ర నేతల క్షుద్ర రాజకీయాలకు బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఆత్మ త్యాగానికి ఒక్క రోజు ముందు తీసిందీ ఫొటో.
అబద్దాల పునాదుల మీద ఒక రాష్ట్రాన్ని నిర్మించబూనితే ఏమవుతుంది? ఆంధ్ర ప్రదేశ్ కి గత అయిదు దశాబ్దాలుగా ఏమవుతుందో అదే అవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనేననే అబద్దం పునాదుల మీద  సీమాంధ్ర నాయకులు తెలుగు జాతిని నిలబెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న ఈ సమయంలో కూడా డిసెంబర్ 15 నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి  సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు నిముషాలు మౌనం పాటించాలనే సర్కులర్ జారీ చేసి తమ తోక వంకరని మరోసారి నిరూపించుకున్నారు సీమాంధ్ర పాలకులు.
అయితే గత పదేళ్ల మలిదశ తెలంగాణ ఉద్యమం పొట్టి శ్రీరాములుకు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఏమీ సంబంధం లేదని కనీసం తెలంగాణ ప్రజలకు తెలియజెప్పగలిగింది.
అసలు పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం వెనుక పెద్ద కుట్రనే దాగి ఉందని, సీమాంధ్ర రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాలకు ఆయన అన్యాయంగా బలైపోయాడని ఇప్పుడు దొరుకుతున్న తాజా సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.
తమ వ్యక్తిగత స్వార్ధం కొరకు ఒక నిండు మనిషి ప్రాణాలను అన్యాయంగా బలిపెట్టారని, అసలు పొట్టి శ్రీరాములు మరణం పూర్తిగా నివారించదగినదని మా దగ్గర ఉన్న సాక్ష్యాలు స్పష్టం  చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికీ తెలియకుండా తొక్కిపెట్టిన ఈ చీకటి కోణంపై MissionTelangana బృందం ప్రత్యేక కధనం:
కధ మొదలవడానికి ముందు కొంచెం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపధ్యం తెలుసుకోవాలి మనం:
పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభానికి దాదాపు రెండేళ్ల ముందే అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ (జవహర్ లాల్, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య-జె.వి.పి కమిటీ) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది. మద్రాస్ నగరంపై మాత్రం ఆంధ్రులు తమ హక్కు వదులుకోవాలని ఆ కమిటీ అభిప్రాయపడింది.
ఈ కమిటీ సిఫారసులను ఆంధ్ర ప్రాంత ప్రజానీకం పెద్ద వ్యతిరేకత లేకుండానే ఒప్పుకుంది.
ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అయితే నవంబర్ 12, 1949 నాడు విజయవాడలో సమావేశం అయి జె.వి.పి. కమిటీ సిఫారసులకు అమోదముద్ర వేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
(click on image for full size)
ఆ తీర్మానం అమోదించిన వారిలో ప్రకాశం పంతులు, కళా వెంకట్రావు, బులుసు సాంబ మూర్తి, ఎన్ జి రంగా వంటి హేమాహేమీలు ఉన్నారు.  ఈ తీర్మానంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అప్పటివరకూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అటు తమిళులూ ఇటు తెలుగు వారూ సంతోషించారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పంపకాలు చేయడానికి మద్రాస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 1949 నాడు 8 మంది సభ్యులతో కూడిన పార్టీషన్ కమిటీని నియమించింది.
(click on image for full size)
అందులో అంధ్ర తరఫున ప్రకాశం పంతులు, వెంకట్రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిలు ఉండగా, తమిళుల తరఫున కుమార స్వామి రాజా, భక్తవత్సలం, మాధవ మీనన్, టి.టి. కృష్ణమాచారి ఉన్నారు.
పార్టీషన్ కమిటీ మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని జనవరి 26,1950 నాటికి ఏర్పాటు చేయాలని, ఆంధ్రకు వేరే రాజధాని నిర్మించాలని, మద్రాసు ప్రభుత్వం ఆంధ్రకు ఒక కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చింది.
దీన్ని ఆమోదించిన మద్రాసు ప్రభుత్వం ఏప్రిల్ 1, 1950 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Telangana NRIs Plan A Massive Rally in Washington DC


Telangana NRIs Plan A Massive Rally in Washington DC

Telangana Non-Resident Indians Joint Action Committee (TNRI-JAC), an umbrella organization of all Telangana organizations abroad, has planned a massive ‘Telangana March’ in Washington, DC on 15th October, Saturday.
The March is organized to extend solidarity to the “Telangana Sakala Janula Samme” – an ongoing general strike demanding statehood. Through this rally the JAC also hopes to bring the issue to the notice of international media.
The TNRI JAC has appealed to the leaders of community, to come forward, support and spread the news about this event to other friends and families, and come together to the “Telangana March” program in large numbers.
Many enthusiastic telanganites from various US cities have already confirmed participation and will be joining in big numbers to participate in this march and share the joy of meeting fellow telanganites.
Geographical area for participation: East coast to mid-west area covering the following cities:
NEW YORK
NEW JERSEY
PHILADELPHIA
DELAWARE
CONNECTICUT
WASHINGTON DC
MARYLAND
CHARLOTTE
BOSTON
CHICAGO
DETROIT
BLOOMINGTON
COLUMBUS
CINCINNATTI
ATLANTA
DALLAS
INDIANAPOLIS
etc..,
Venue: at National Mall, Washington DC
Organizers Contact Information
Srinivas Mamidi – 908-642-7057
Srinivas Kompally – 732-641-0055
Narayana Swamy – 201-323-6665
Ravi Dhannapuneni – 732-501-6424
Indrasena Reddy – 732-770-2448

Worried over Hyderabad’s brand image as a global destination taking a beating


Worried over Hyderabad’s brand image as a global destination taking a beating
Worried over Hyderabad’s brand image of a global destination to host international events taking a beating if some untoward incidents take place during the Telangana March on September 30, Ministers from Telangana decided to appeal to the Telangana joint action committee (T-JAC) to put off the march.
In the backdrop of the T-JAC being firm on going ahead with Telangana March and its fallout on 11 Conference of Parties beginning on October 1, a perturbed government convened a meeting at short notice with the Ministers from the region on Thursday night.
Over a dozen Ministers attended the meeting chaired by Chief Minister N. Kiran Kumar Reddy and expressed serious concern at the likely damage any violent incident could cause to the prestigious international event.
“All the Ministers from Telangana have decided to make an appeal to the T-JAC to postpone the march. The Chief Minister will also make similar appeal and hold an all-party meeting on the issue,” Minister for Information and Public Relations D.K. Aruna told The Hindu on Thursday night. Ministers were of the opinion that it was once-in-a-lifetime opportunity for Andhra Pradesh to project Hyderabad as a global destination. Majority of the Ministers feared that the march, almost coinciding with the Ganesh Nimmajanam on September 29 and 30, could trigger violence.
“As the march would be held on Tank Bund along with immersion, there is a likelihood of anti-social elements taking advantage of the situation and indulging in violence,” another Minister remarked.
It is understood that the Ministers said just one incident was enough to ruin the image of Hyderabad, which the government has been carefully nurturing over a period of time. They pointed out that at least two global conventions pertaining to medical practitioners and agriculture were slated in November and December this year respectively.

KARIMNAGAR KAVATHU

Kodandaram lashes out at Govt for dilly dallying on T

T-JAC Chairman Prof. Kodandaram addressing a massive meeting 'Karimnagar Kavathu' on Sunday

As a trial for the proposed ‘Chalo Hyderabad’ programme which is scheduled for September 30, a massive rally(Kavaathu) and meeting were held in Karimnagar on Sunday


Eeda Madhukar Reddy

Karimnagar: Telangana political JAC chairman Prof Kodandaram and several other leaders, at the ‘Karimnagar Kavaathu’ programme held in the town on Sunday, lashed out at the State Government and also on the top leaders belonging to Seemandhra for dilly dallying on separate Telangana State issue.

As a trial for the proposed ‘Chalo Hyderabad’ programme which is scheduled for September 30, a massive rally and meeting was held in Karimnagar on Sunday. The rally (Kavaathu) commenced from Manair Bridge early in the morning and passed through the main roads culminating in a public meeting at Circus Grounds.

Government employees, teachers, workers from various sections, and party activists of TRS, CPI, BJP, CPM and CPM-ML (New Democracy) participated in the rally. More than 10,000 activists participated in the rally and in the meeting. 

Prof Kodandaram said the present plight of Telangana is due to the partisan attitude by the rulers from Andhra region. Their (the Telangana leaders) fight is against the rulers from Andhra region and not against the people from Andhra region, he said.

Even the present Government under the rule of N Kiran Kumar Reddy has been showing biased attitude towards the people of Telangana. Farmers have been facing hardships due to power cuts and due to scarcity of fertilizers. Students were also facing losses due to shortage of seats in professional colleges, the JAC leader has said.

In a scathing attack, Kodandaram targeted Civil Supplies Minister D Sridhar Babu. He said that the Minister would face the same fate that his father (Sri Padarao) met some years ago.

Prof Kodandaram reiterated that the proposed ‘Chalo Hyderabad’ Programme would be a grand success on September 30. He expressed happiness over the overwhelming support received from common people for Karimnagar Kavaathu. He asked all the political party leaders to conduct such rallies in other Telangana districts as a trial for the proposed `Million march’.

JAC co-chairman Malle- palli Lakshmaiah, Pittala Ravinder, BJP senior leader Ch Vidyasagar Rao, CPI leader Chada Venkat Reddy, TRS MLA Satyanarayana, TNGOs leaders Srinivas Goud, Vithal, poets and artists participated in the rally and public meeting.

TELANGANA MARCH POSTERS IN INTERNET