Tuesday, September 10, 2013

తెలంగాణ జేఏసీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు.

 తెలంగాణ జేఏసీ సమావేశం ఇవాళ  మధ్యాహ్నం మూడున్నరకు..

తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్ కమిటీ  ఇవాళ మద్యాహ్నం  మూడున్నరకు సమావేశం  కానున్నారు.  ఈ నెల పన్నెండవ తేదీన జరిగే విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం... ఎజెండా...ను ఇందులో చర్చిస్తారు. ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై తొమ్మిదవ తేదీన జెఏసీ నేతృత్వంలో ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మందితో సదస్సు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. దీనిపైన చర్చిస్తారు. ఈ సదస్సుకు తెలంగాణ స్వాబిమాన సదస్సు అనే పేరును నామకరణం చేయనున్నట్లు తెలిసింది.  మద్యాహ్నం మూడున్నరకు జరిగే ఈ స్టీరింగ్ కమిటీలో ఈ అంశాలపై స్థూలంగా చర్చిస్తారు. ఇందులో చర్చించిన అంశాలను విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా జేఏసీ నేతల నడుమ తుది నిర్ణయం తీసుకుంటారు.

No comments: