Monday, September 9, 2013

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ భేటీ


 ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెరాస సెక్రటరీ జనరల్  కె.కేశవరావుతో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఎపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్, ఢిల్లీ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.ఈ సమావేశంలో కేసీఆర్తో పాటు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు  కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్్, విఠల్లు పాల్గననున్నారు. ఎపీఎన్జీవోలకు దీటుగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న యోతనలో జేఎసీ ఉంది. ఎపీఎన్జీవోలు ఏదైతై ఎల్బీ స్టేడియం మీదుగా అవాస్తవాలను ప్రజలకు చెప్పారో.... అక్కడి నుంచే తెలంగాణ వాదాన్ని, ఉద్యోగులు నష్టపోతున్న తీరును వివరించాలన్న ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్తో చర్చ తరువతా దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

No comments: